![]() |
![]() |
by Suryaa Desk | Tue, Jun 10, 2025, 07:42 PM
ఏడాది పాలనలో వైఫల్యాలను మీడియాలో ఎండగడుతున్న సీనియర్ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావుపై కూటమి ప్రభుత్వం అక్రమంగా కేసులు బనాయించిందని వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ టీవీ డిబేట్లో జర్నలిస్ట్ కృష్ణంరాజు మాట్లాడిన మాటలను వైయస్ఆర్సీపీ, సాక్షిటీవీ, వైయస్ జగన్, ఆయన కుటుంబానికి ఆపాదిస్తూ కుట్రపూరితంగా వివాదాన్ని సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిసారీ డైవర్షన్ పాలిటిక్స్తో ప్రజలను మభ్యపెట్టే చంద్రబాబు గైడెన్స్తోనే తాజాగా ఈ వివాదాన్ని సృష్టించి, తన పార్టీ శ్రేణులతో ఆర్గనైజ్డ్ ఆందోళనలు చేయించారని ధ్వజమెత్తారు. తన ప్రభుత్వంపై ఎవరూ మాట్లాడకూదడనే నిరంకుశ ఆలోచనలో భాగంగానే సాక్షిమీడియా కార్యాలయాలపై దాడులు చేయించారని అన్నారు.
Latest News