వైసీపీ ప్రభుత్వం అక్రమంగా వారికీ నగదు చెల్లించారు
 

by Suryaa Desk | Tue, Jun 10, 2025, 07:25 PM

వైసీపీ ప్రభుత్వం అక్రమంగా వారికీ నగదు చెల్లించారు

ప్రభుత్వ పథకాల సర్వే పేరుతో గత వైసీపీ ప్రభుత్వం సెర్ప్‌ ద్వారా వై మీడియా అనే సంస్థకు రూ.96 కోట్లు అక్రమంగా చెల్లించిందని రాష్ట్ర ఇరవై సూత్రాల కార్యక్రమం అమలు కమిటీ చైర్మన్‌ లంకా దినకర్‌ ఆరోపించారు. ఈ అక్రమాలపై విచారణ చేస్తున్నామని, పూర్తి వివరాలు తర్వాత వెల్లడిస్తామని చెప్పారు. సోమవారం అమరావతి సచివాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ ఏర్పడి ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రాయోజిత పథకాల అమలు తీరుపైన 26 జిల్లాల అధికారులతో సమీక్షలు పూర్తి చేశామన్నారు. గత ఐదేళ్లలో కేంద్రం 2.61 లక్షల టిడ్కో ఇళ్లు ఇవ్వగా 1.40 లక్షలే లబ్ధిదారులకు ఇచ్చారని, అందులో నివసిస్తున్నది 87 వేల మందేనని పేర్కొన్నారు. జల్‌ జీవన్‌ మిషన్‌లో అవినీతి అక్రమాలకు పాల్పడి, నాణ్యత లేకుండా పనులు చేసి దోచుకున్నారన్నారు. రానున్న రోజుల్లో గ్రామీణ ప్రాంతాల్లో 97 లక్షల గృహాలకు తాగునీరు అందిస్తామన్నారు.

Latest News
Measles health alert issued for Sydney Fri, Jun 20, 2025, 01:08 PM
Chandrababu Naidu greets wife Bhuvaneshwari on birthday Fri, Jun 20, 2025, 01:04 PM
Flew with compassion, you will be remembered: Air India pays tribute to cabin crew lost in crash Fri, Jun 20, 2025, 12:57 PM
Plane crash: 220 DNA samples matched, 202 bodies handed over to their families Fri, Jun 20, 2025, 12:50 PM
UP CM inaugurates 91.35-km-long Gorakhpur link expressway Fri, Jun 20, 2025, 12:45 PM