![]() |
![]() |
by Suryaa Desk | Tue, Jun 10, 2025, 07:11 PM
ఏపీ మహిళలను కించ పరిచే వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత సజ్జల రామకృష్ణ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు లేఖ చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. మహిళలను సంకర జాతి అంటూ సజ్జల దూషణలను రఘురామ తీవ్రంగా తప్పుబట్టారు. కుల వివక్షకు సంబంధించిన ఈ పదం వాడటంపై భారత శిక్షాస్మృతి ప్రకారం చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. సజ్జల దూషణలు అమరావతిలో నివసిస్తున్న వేలాది మంది ప్రజల మనోభావాలను దెబ్బతీసిందని తెలిపారు.సజ్జల రామకృష్ణ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని డీజీపీకి ఉపసభాపతి లేఖ రాశారు. భవిష్యత్తులో ఇటువంటి అవమానకరమైన కులతత్వ భాషను ఎవరూ ఉపయోగించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేస్తూ సజ్జల వ్యాఖ్యలను డిప్యూటీ స్పీకర్ రఘురామ తన లేఖకు జత చేశారు.
Latest News