![]() |
![]() |
by Suryaa Desk | Tue, Jun 10, 2025, 04:19 PM
ఈ ఏడాది విడుదలైన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన కొండాపురం మండలానికి చెందిన ఐదుగురు విద్యార్థులు షైనింగ్ స్టార్స్ అవార్డుకు ఎంపికయ్యారు. శివాన్విత, త్రైతదేవి, సంయుక్త, మనోజ్ఞ, వరుణ్లు జిల్లా కలెక్టర్ శ్రీధర్ చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు.
వీరికి రూ. 20,000 చెక్తో పాటు ప్రశంసా పత్రం అందజేయబడింది. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యం హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయం విద్యార్థుల కఠిన శ్రమ, అంకితభావాన్ని ప్రతిబింబిస్తుందని వారు అభిప్రాయపడ్డారు.