![]() |
![]() |
by Suryaa Desk | Tue, Jun 10, 2025, 01:14 PM
సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు అక్రమం, కక్ష పూరితం అని, సాక్షి మీడియాను టార్గెట్ చేసిన సీఎం చంద్రబాబు, నిజాయితీగా పని చేసే జర్నలిస్టును వేధించడం దారుణమని వైయస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. జర్నలిస్ట్ కృష్ణంరాజు వ్యాఖ్యలతో ‘సాక్షి’కి ఏంటి సంబంధం అన్న ఆయన, వైయస్ జగన్ను, ఆయన సతీమణి భారతిని తిట్టడం ఏంటని, పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ..... చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఈనెల 12 నాటికి ఏడాది పూర్తవుతుంది. కూటమి ప్రభుత్వం ఈ ఏడాది పాలనలో అన్ని రంగాల్లో ఘోరంగా విఫలమైంది. ప్రభుత్వ వైఫల్యాల మీద ప్రజల్లో చర్చ జరుగుతుంటే ఓర్వలేక అరెస్టులతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అక్రమ అరెస్టు కూడా డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే జరిగింది. మీడియా ఛానళ్ల అండ చూసుకుని సాధారణ విషయాలను నేరాలుగా చూపించి వైయస్సార్సీపీ మీద బురద జల్లాలనే తాపత్రయం అడుగడుగునా కనిపిస్తోంది. కొమ్మినేని శ్రీనివాసరావుకి జర్నలిస్టుగా అపారమైన అనుభవం ఉంది. అంత సుదీర్ఘమైన అనుభవం ఉన్న వ్యక్తి తప్పు చేశాడని నిందించడం దారుణం. గతంలో ఆయన ఎన్టీవీలో పని చేస్తున్నప్పుడు చంద్రబాబు ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడటం లేదనే కారణంతో ఛానల్ యాజమాన్యం మీద ఒత్తిడి తెచ్చి, ఆ షోను ఆపివేయించారు. ఉద్యోగం నుంచి కూడా తీసేయించారు. ఇప్పుడు ఏకంగా తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేయించారు అని మండిపడ్డారు.
Latest News