![]() |
![]() |
by Suryaa Desk | Tue, Jun 10, 2025, 01:11 PM
ప్రజలకు మాట ఇచ్చి తప్పిన కూటమి ప్రభుత్వంపై ప్రజావ్యతిరేక పోరాటాలకు సంసిద్దంగా ఉండాలని వైయస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో యువజన విభాగం రాష్ట్ర కమిటీ నాయకులతో సజ్జల రామకృష్ణారెడ్డి సమావేశమయ్యారు. ఈ భేటీలో పార్టీ కేంద్ర కార్యాలయ ఇంఛార్జ్, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, వైయస్ఆర్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు, యూత్ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్దార్ధ్ రెడ్డి, యువజన విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా అధ్యక్షులు పాల్గొన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బూత్ లెవల్నుంచి సంస్ధగతంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా పార్టీ అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా వైయస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అధ్యక్షతన తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు అంశాలను చర్చించారు.
Latest News