![]() |
![]() |
by Suryaa Desk | Tue, Jun 10, 2025, 01:10 PM
డైవర్షన్ పాలిటిక్స్ ఎల్లకాలం చెల్లవంటూ వైయస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్రెడ్డి చంద్రబాబును హెచ్చరించారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు, రెడ్బుక్ రాజ్యాంగం అమలు, జర్నలిస్ట్ కొమ్మినేని అరెస్టు, సాక్షి కార్యాలయాలపై పచ్చమూకల దాడిని ఖండిస్తూ వైయస్ జగన్ తన ఎక్స్ ఖాతలో పోస్టు చేశారు.అయన స్పందిస్తూ..... చంద్రబాబు గారూ.. అనని మాటలను సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుగారికి ఆపాదిస్తూ, వాటిని వక్రీకరించి విషప్రచారం చేసి, ఆయన్ను అరెస్టు చేయడమే కాకుండా సాక్షి యూనిట్ ఆఫీసులమీద ఒక పథకం ప్రకారం దాడులు చేయించారు. ఈ అరాచకానికి మహిళల గౌరవం అనే ముసుగు తొడిగి ఎక్కడికక్కడ విధ్వంసం చేస్తూ ఆటవికంగా వ్యవహరిస్తున్నారు. కోడలు మగపిల్లాడిని కంటే అత్త వద్దంటుందా? అని మీరు, ఆడపిల్ల కనిపిస్తే ముద్దైనా పెట్టాలి లేదా కడుపైనా చేయాలి అని మీ బావమరిదిగారు గతంలో అన్న మాటలు చూస్తే.. మీకు మహిళల మీద ఎంతటి గౌరవం ఉందో తెలుస్తుంది అని అన్నారు.
Latest News