మస్క్‌కు పీటీఎస్డీ సమస్య ఉంది.. దాని వల్లే ట్రంప్‌తో గొడవ పడుతున్నాడు
 

by Suryaa Desk | Mon, Jun 09, 2025, 07:53 PM

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మధ్య మాటల యుద్ధం సాగుతున్న విషయం అందరికీ తెలిసిందే. మొన్నటి వరకు ఎక్స్ వేదికగా ఇరవురు నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. నేను లేకపోతే ట్రంప్ ఎన్నికల్లో గెలవలేక పోయేవారని, అమెరికా సెక్స్ కుంభకోణంతో అతడికి సంబంధం ఉందంటూ మస్క్ వ్యాఖ్యానించారు. డోజ్ నుంచి తొలగించడం వల్లే మస్క్ తనపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ట్రంప్ చెప్పారు. ఇలా రోజుకో రకమైన వాదనతో వీరిద్దరూ గొడవ పడుతుండగా.. తాజాగా దీనిపై మస్క్ తండ్రి ఎరోల్ మస్క్ స్పందించారు. వీరిద్దరి గొడవకు గల అసలైన కారణాన్ని వెల్లడించారు. అలాగే ఆ మాటల యుద్ధంలో చివరకు గెలిచేది ట్రంపేనన్న ఆయన.. తన కొడుకు ఓడిపోవడం ఖాయమని చెప్పుకొచ్చారు.


మొన్నటి వరకూ ప్రాణ స్నేహితుల్లో కలిసి ఉన్న ట్రంప్, మస్క్ మధ్య విబేధాలు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. బహిరంగంగానే వీరిద్దరూ పరస్పర ఆరోపణలు చేసుకోగా.. అంతర్జాతీయ వ్యాప్తంగా ఈ అంశం హైలెట్ అయింది. ముఖ్యంగా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలవాడానికి తానే కారణం అని మస్క్ చెప్పగా.. అవన్నీ తప్పుడు వార్తలేనని ట్రంప్ పేర్కొన్నారు. మస్క్ మద్దతు లేకపోయినా గెలిచేవాడనని చెప్పారు. ఆ తర్వాత ట్రంప్‌కు అమెరికా సెక్స్ కుంభకోణంతో సంబంధాలు ఉన్నాయని చెప్పిన మస్క్.. తానే ఓ రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు కూడా హింట్ ఇచ్చారు. ఇందుకు మద్దతిస్తారా అంటూ ఆయన ఫాలోవర్లను అడగ్గా.. చాలా మంది సపోర్ట్ చేశారు.


అయితే రెండ్రోజుల క్రితమే ట్రంప్.. ఈ గొడవలపై స్పందిస్తూ తాను చాలా బిజీగా ఉన్నానని చెప్పారు. మస్క్ వ్యాఖ్యలపై స్పందించేంత సమయం లేదన్నారు. ఆ తర్వాత మస్క్ కూడా.. ట్రంప్‌కు అమెరికా సెక్స్ కుంభకోణంతో సంబంధం ఉందంటూ చేసిన ట్వీట్ తొలగించగా.. ఇద్దరి మధ్య గొడవ తగ్గిందని అంతా భావించారు. ఇలాంటి సమయంలోనే వీరిద్దరి మధ్య గొడవలపై ఎలాన్ మస్క్ తండ్రి ఎరోల్ మస్క్ స్పందించారు. ముఖ్యంగా తన కుమారుడు మస్క్‌కు పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిసార్డర్ (PTSD) ఉందని.. దాని వల్లే అతడిలా ఆవేశంగా మాట్లాడుతున్నట్లు చెప్పారు. డోజ్ అధినేతగా ఉన్నప్పుడు ట్రంప్ సహా మస్క్ చాలా ఇబ్బందులు పడ్డాడని.. దాన్ని వల్లే ఈ సమస్య వచ్చిందన్నారు.


ఎలాన్ మస్క్ ప్రస్తుతం చాలా ఒత్తిడిని ఎదుర్కొంటున్నాడని ఎరోల్ మస్క్ వివరించారు. ఇలాంటి సమయంలోనే ట్రంప్ తీసుకు వచ్చిన బిల్లుతో మస్క్ తీవ్ర అసహనానికి గురయ్యాడని అన్నారు. అందుకే అధ్యక్షుడిపై ఆరోపణలు చేస్తున్నాడని పేర్కొన్నారు. ఈ విషయంలోనే వీరిద్దరి మధ్య గొడవ వచ్చిందని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్, సెనెట్‌లలో ఓట్లు పొందాలంటే ట్రంప్ అలాంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుందనే విషయాన్ని మస్క్ అర్థం చేసుకోవట్లేదని స్పష్టం చేశారు. ట్రంప్ దేశానికి అధ్యక్ష స్థానంలో ఉన్నాడు కాబట్టే ఈ వివాదంలో తన కుమారుడిపై ఆయన గెలిచే అవకాశం ఉందన్నారు. ఇప్పటికైనా ఇరువురు వివాదాలు పక్కన పెట్టి కలిసి పని చేయాలని సూచించారు.

Latest News
Playing domestic cricket serves as good challenge when not playing international games: SKY Mon, Dec 08, 2025, 02:47 PM
Two killed, 20 injured in highway accident in Afghanistan Mon, Dec 08, 2025, 02:43 PM
IndiGo cancels 112 flights at Hyderabad Airport, passengers continue to suffer Mon, Dec 08, 2025, 02:39 PM
Govt's multi-pronged strategy boosting consumption, growth: FM Sitharaman Mon, Dec 08, 2025, 02:37 PM
Hardik's experience is invaluable, gives good balance to the side: Suryakumar Mon, Dec 08, 2025, 02:34 PM