అనంతపురం జిల్లాలో భారీ వర్షం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
 

by Suryaa Desk | Mon, Jun 09, 2025, 12:49 PM

అనంతపురం జిల్లాలో భారీ వర్షం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక

అనంతపురం జిల్లాలో ఆదివారం రాత్రి వర్షం బీభత్సంగా కురిసింది. ఉరవకొండ, విడపనకల్లు, బెలుగుప్ప, వజ్రకరూరు మండలాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం నమోదైంది. అనూహ్యంగా కురిసిన ఈ వర్షానికి వాగులు, వంకలు పొంగిపొర్లాయి.
బూదగవి వంక మరువ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. పెంచులపాడు – పోలికి మధ్య వాగు ప్రవాహం అత్యధికంగా పెరిగింది. దీంతో రాత్రి నుంచే ఈ మార్గంలో వాహన రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వర్షానికి సంబంధించి పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది.
స్థానిక అధికారులు సహాయక చర్యలు ప్రారంభించినట్టు సమాచారం. ప్రజలు వాగులు, వంకల దగ్గరకు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. వర్షాభావానికి అలవాటు పడిన ఈ ప్రాంతాల్లో ఒకేసారి ఇలా భారీ వర్షం పడటం ప్రజలను ఆందోళనకు గురిచేసింది.

Latest News
Australia suspends embassy in Iran, directs officials to leave Fri, Jun 20, 2025, 03:41 PM
Russia shot down over 61 Ukrainian drones overnight Fri, Jun 20, 2025, 03:35 PM
1st Test: Sudharsan handed debut as England elect to bowl first against India at Headingley Fri, Jun 20, 2025, 03:33 PM
UN warns of looming famine in Yemen Fri, Jun 20, 2025, 03:33 PM
PM Modi's 'lalten-panja' jab at RJD-Cong, says Bihar's role vital in Viksit Bharat goal Fri, Jun 20, 2025, 02:46 PM