![]() |
![]() |
by Suryaa Desk | Sun, Jun 08, 2025, 07:05 PM
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆదివారం విజయవాడలో సందడి చేశారు. నగరంలో కొత్తగా ఏర్పాటు చేసిన "కొనికి" అనే సెలూన్ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ ప్రారంభోత్సవ వేడుకలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యుడు యార్లగడ్డ వెంకట్రావు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్, యార్లగడ్డ వెంకట్రావు ఇరువురూ సెలూన్ నిర్వాహకులకు తమ శుభాకాంక్షలు తెలియజేశారు. వ్యాపారం విజయవంతంగా సాగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమానికి పవన్ కల్యాణ్ లేత నీలం రంగు రౌండ్ నెక్ టీషర్ట్, నలుపు రంగు షార్ట్స్ ధరించి వచ్చారు. ఆయన క్యాజువల్ లుక్ అందరినీ ఆకట్టుకుంది, ట్రెండీగా కనిపించిందని పలువురు వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తన సోషల్ మీడియా ఖాతా ద్వారా పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
Latest News