![]() |
![]() |
by Suryaa Desk | Sun, Jun 08, 2025, 06:52 PM
ప్రజలకు పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం జాతీయ రహదారిపై తరలిస్తున్న 28 టన్నుల రేషన్ బియ్యం లారీని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రేషన్ బియ్యం విలువ రూ. 27.50 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. పట్టుబడ్డ సమయంలో లారీ డ్రైవర్ లారీని వదిలేసి పరారయ్యాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Latest News