![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jun 07, 2025, 03:05 PM
ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లా రామగిరి మండలంలో దారుణం చోటు చేసుకుంది. 8వ తరగతి చదువుతున్న దళిత బాలికను ప్రేమిస్తున్నానంటూ గ్రామానికి చెందిన అభిషేక్ ఆమెను నమ్మించాడు. అనంతరం అత్యాచారం చేశాడు. అభిషేక్ స్నేహితుడు కూడా బాలికపై అత్యాచారం చేసి, సెల్ఫోన్లో వీడియో తీయించాడు. ఆ వీడియో చూపించి 13 మంది ఆ బాలికపై అత్యాచారం చేశారు. బాలిక గర్భం దాల్చడంతో అసలు విషయం శుక్రవారం వెలుగుచూసింది. పోలీసులు కేసు నమోదు చేశారు.
Latest News