![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jun 07, 2025, 02:57 PM
కర్ణాటక రాష్ట్రం, బెంగళూరు శివారు అనేకల్ తాలూకాలోని హీలల్గే గ్రామంలో శుక్రవారం ఒళ్లు గగుర్పొడిచే ఘటన చోటుచేసుకుంది. శంకర్ అనే వ్యక్తి తన భార్య మానస (26) తల నరికి, ఆ తలతో నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు.
శంకర్, మానస గతంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఒక పాప కూడా ఉంది. అయితే, మానస మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు శంకర్కు అనుమానం కలిగింది. ఈ విషయంలో ఆమెను పలుమార్లు హెచ్చరించినప్పటికీ, ఆమె ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో కోపంతో ఆమెను హత్య చేసినట్లు తెలుస్తోంది.
ఘటన జరిగిన వెంటనే శంకర్ తన భార్య తలను తీసుకుని అనేకల్ పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.