|
|
by Suryaa Desk | Sat, Jun 07, 2025, 11:24 AM
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి వెలుపల క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. శుక్రవారం శ్రీవారిని 72,174 మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే 35,192 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.88 కోట్లుగా ఉంది.
Latest News