అక్రమ వలసదారులపై ట్రంప్ ఉక్కుపాదం.. ఒకే రోజు రికార్డ్ స్థాయిలో 2200 మంది అరెస్ట్
 

by Suryaa Desk | Fri, Jun 06, 2025, 08:19 PM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. అక్రమ వలసదారుల పట్ల కఠిన వైఖరిని కొనసాగిస్తూనే ఉన్నారు. దేశంలో లక్షల సంఖ్యలో ఉన్న అక్రమ వలసదారులను వారి స్వదేశాలకు పంపిస్తానని ట్రంప్ శపథం చేశారు. ఈ నేపథ్యంలోనే తన సన్నిహితుడు స్టీఫెన్ మిల్లర్, హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టి నోమ్, ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఐసీఈ) అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. రోజుకు 3 వేల మందిని అరెస్ట్ చేయాలని అధికారులకు ట్రంప్ ఆదేశాలు జారీ చేసినట్లు నివేదికలు వస్తున్న నేపథ్యంలో.. తాజాగా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు.. చరిత్రలోనే ఒకే రోజు అత్యధిక వలసదారులను అరెస్ట్ చేశారు.


ఇంటర్నేషనల్ న్యూస్ ఏజెన్సీల ప్రకారం.. మంగళవారం రోజున ఐసీఈ అధికారులు 2200 మందికి పైగా వలసదారులను అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేసిన వారందరూ ఐసీఈ ఆల్టర్నేటివ్ టు డిటెన్షన్ (ఏటీడీ) కార్యక్రమంలో నమోదు చేసుకున్నవారేనని తెలుస్తోంది. ఈ ఏటీడీ కార్యక్రమం కింద ప్రజా భద్రతకు ముప్పు కాని చట్టవిరుద్ధ వలసదారులను యాంకిల్ మానిటర్లు, స్మార్ట్‌ఫోన్ యాప్‌లు లేదా ఇతర జియోలొకేటింగ్ ప్రోగ్రామ్‌ల ద్వారా ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షణలో ఉంచుతారు. అలాగే ఐసీఈ కేంద్రాల్లో తరచూ తనిఖీలు ఉంటాయి.


తాజాగా ఏటీడీలో ఉన్న వలసదారులకు షెడ్యూల్ కంటే ముందుగానే ఐసీఈ కార్యాలయానికి హాజరు కావాలని మెసేజ్‌లు చేశారు. దీంతో వారు కార్యాలయాలకు రాగానే అరెస్ట్ చేశారు. తనిఖీల కోసం వచ్చిన ఏడుగురు వ్యక్తుల చేతులకు సంకెళ్లు వేసి కార్లలోకి ఎక్కించి తీసుకెళ్లినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. వారిలో ఒకరు కొలంబియా దేశానికి చెందిన 30 ఏళ్ల వ్యక్తి అని పేర్కొన్నారు. దీంతో అతని వైపు వాదిస్తున్న లాయర్ ఇమ్మిగ్రెంట్ డిఫెండర్స్ లా సెంటర్‌లో డైరెక్టింగ్ అటార్నీ మార్గరెట్ కార్జియోలీ మాట్లాడుతూ.. ఆ వ్యక్తి ప్రతి ఒక్క ఐసీఈ అపాయింట్‌మెంట్‌కు వెళ్లాడని.. తనపై విధించిన అన్ని నిబంధనలను పాటిస్తున్నాడని పేర్కొన్నారు.


ప్రస్తుతం అమెరికాలోని అక్రమ వలసదారులకు కొత్త భయాలు నెలకొన్నాయి. వలసదారులు ఐసీఈ కేంద్రానికి వెళ్తే అదుపులోకి తీసుకునే అవకాశం ఉండగా.. ఒకవేళ అపాయింట్‌మెంట్‌కు హాజరు కాకపోతే దేశం నుంచి బహిష్కరించే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఒక ఐసీఈ ప్రతినిధి మాట్లాడుతూ అరెస్ట్ చేసిన వారికి ఇమ్మిగ్రేషన్ న్యాయమూర్తి నుంచి తుది బహిష్కరణ ఆదేశాలు ఉన్నాయని.. వారు ఆ ఆదేశాలను పాటించలేదని తెలిపారు. అయితే చాలా మంది లాయర్లు మాత్రం తమ క్లైయింట్లకు తుది బహిష్కరణ ఆదేశాలు లేనప్పటికీ అరెస్ట్ చేశారని వెల్లడించారు.


అమెరికా నుంచి లక్షలాది మందిని బహిష్కరిస్తానని డొనాల్డ్ ట్రంప్ వాగ్దానం చేసినప్పటికీ.. మాజీ ఐసీఈ అధికారులు మాత్రం అది జరగడం ఐసీఈకి సాధ్యం కాని పని అని చెబుతున్నారు. ఐసీఈ డేటా ప్రకారం.. 20 వేల యాంకిల్ మానిటర్లు ఐసీఈ ట్రాకింగ్‌లో ఉన్నాయని.. ఏటీఎఫ్‌లో ఉన్నవారిలో 98.5 శాతం మంది తమ తనిఖీలకు హాజరవుతున్నారని.. తద్వారా ఈ సంఖ్యలను పెంచేందుకు ఐసీఈ అరెస్టులకు వారు సులభంగా దొరుకుతారని భావిస్తున్నారు. అయితే ఐసీఈ ఈ రకమైన చర్యలు తీసుకుంటుండటంతో వలసదారులు ఇప్పుడు మరింత భయపడుతున్నారని ప్రభుత్వ సంబంధాల సీనియర్ డైరెక్టర్ గ్రెగ్ చెన్ అన్నారు.


అంతేకాకుండా ఈ అక్రమ వలసదారుల అరెస్టులను పెంచడానికి ఐసీఈ.. ఇతర సంస్థల నుంచి 5 వేల మంది ఉద్యోగులను నియమించుకుంది. ఐసీఈ ఇప్పటికే ఆల్టర్నేటివ్ టు డిటెన్షన్‌లో ఉన్నవారిని అరెస్ట్ చేయడం బ్యూరోక్రటిక్ థియేటర్ మాత్రమేనని బైడెన్ పాలనలో ఐసీఈ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా పనిచేసిన జాసన్ హౌసర్ తెలిపారు. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు తనిఖీల్లో పాల్గొని, నిబంధనలను పాటిస్తూ పర్యవేక్షణలో ఉన్నవారని.. ఎక్కువగా చట్టబద్ధమైన హోదాను కలిగి ఉన్నవారని వివరించారు.

Latest News
India reiterates commitment to enhance maritime cooperation with Maldives Wed, Dec 17, 2025, 04:37 PM
President Droupadi Murmu arrives in Hyderabad for winter sojourn Wed, Dec 17, 2025, 04:32 PM
India launches AI-driven community screening for diabetic retinopathy Wed, Dec 17, 2025, 04:08 PM
'He's got a good pedigree at the death': RCB coach Andy flower on acquisition of Jacob Duffy Wed, Dec 17, 2025, 04:07 PM
Ethiopia's Abiy Ahmed Ali takes to Hindi, thanks PM Modi for bolstering India-Ethiopia ties Wed, Dec 17, 2025, 04:06 PM