|
|
by Suryaa Desk | Fri, Jun 06, 2025, 06:41 PM
దేశ ప్రజలకు, ముఖ్యంగా రుణ గ్రహీతలకు భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) గుడ్ న్యూస్ చెప్పింది. కీలకమైన రెపో రేటును గణనీయంగా తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలోని ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) ఈ ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. రెపో రేటును ఏకంగా 50 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో కొత్త రేటు 5.5 శాతానికి చేరింది. ఈ నిర్ణయం వల్ల దీర్ఘకాలిక రుణాలు, ముఖ్యంగా గృహ రుణాలు తీసుకున్న వారికి ఈఎంఐల భారం తగ్గే అవకాశం ఉంది.
Latest News