|
|
by Suryaa Desk | Fri, Jun 06, 2025, 01:50 PM
ఏపీలో పామాయిల్ సాగు చేస్తున్న రైతులకు కనీస మద్దతు ధర కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం, వాణిజ్య భవన్లో కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి సునీల్ బర్త్వాల్కు వినతి పత్రం అందజేశారు. 2025 మే 31న విడుదలైన కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు నోటిఫికేషన్ను వెనక్కి తీసుకుంటూ, క్రూడ్ ఎడిబుల్ ఆయిల్స్పై 50 శాతం కస్టమ్స్ డ్యూటీ విధించడం ద్వారా రైతులకు ఒక్కో మెట్రిక్ టన్నుకు రూ.22,000 లభించే అవకాశం ఉందని పేర్కొన్నారు.
Latest News