|
|
by Suryaa Desk | Mon, May 26, 2025, 03:32 PM
కడప జిల్లాలో ఈ నెల 27, 28, 29 తేదీల్లో జరగనున్న మహానాడు సందర్భంగా, టిడిపి నాయకులు లక్ష్మీ ప్రసాద్ రెడ్డి సోమవారం రామాపురంలో భోజన వసతి ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాయచోటి ప్రాంతం నుంచి మహానాడుకు విచ్చేసే టిడిపి నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యుల కోసం సముచిత భోజన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.