|
|
by Suryaa Desk | Sun, May 25, 2025, 02:37 PM
అకాల వర్షాలు, అల్పపీడనం కారణంగా ఈసారి వేసవి.. వర్షాకాలంగా మారింది. ఆదివారం నుంచి రోహిణి కార్తె ప్రారంభమైంది. సాధారణంగా రోహిణి కార్తెలో రోళ్లు(బండలు) పగిలేలా ఎండలు ఉంటాయని నానుడి. 8 రోజులు ముందుగానే నైరుతి రుతుపవనాలు కేరళను తాకడంతో ఇప్పుడు ఆ పరిస్థితి లేనట్లే కనిపిస్తోంది. మరో 2-3 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి అవి ప్రవేశించడంతో రోళ్లు పగిలే ఎండలు ఉండవని భావిస్తున్నారు.
Latest News