![]() |
![]() |
by Suryaa Desk | Sat, May 24, 2025, 04:08 PM
ఇటు విజయవాడ అటు విశాఖ నగరాలు వరుస బాంబు బెదిరింపు కాల్స్తో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. పలు ప్రాంతాల్లో బాంబులు పెట్టామంటూ ఆగంతకుల ఫోన్ కాల్స్తో బాంబు స్క్వాడ్, పోలీసులు ఉరుకులు పరుగులు తీశారు. ఆయా ప్రాంతాల్లో బాంబు స్క్వాడ్ విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. చివరకు ఎలాంటి బాంబు ఆనవాళ్లు లేకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈరోజు (శనివారం) ఉదయం విజయవాడలోని బీసెంట్ రోడ్డులో బాంబు పెట్టామని, ఆ తరువాత రైల్వేస్టేషన్కు బాంబు బెదరింపు కాల్స్ వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు తనిఖీలు నిర్వహించి బాంబు లేదని నిర్ధారించారు. తాజాగా విశాఖ రైల్వేస్టేషన్లోనూ బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేసింది. విశాఖ ఎల్టీటీ ఎక్స్ప్రెస్కు బాంబు బెదిరింపు కాల్ రావడంతో తనిఖీలు చేశారు. ఈ క్రమంలో అనుమానిత బ్యాగ్ను గుర్తించారు. అయితే బాంబు ఆనవాళ్లు ఎక్కడా లేకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
Latest News