తీవ్ర అస్వస్థతకి గురైన వల్లభనేని వంశీ
 

by Suryaa Desk | Sat, May 24, 2025, 01:32 PM

తీవ్ర అస్వస్థతకి గురైన వల్లభనేని వంశీ

విచారణ నిమిత్తం కంకిపాడు పోలీసుల కస్టడీలో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌ శుక్రవారం అర్ధరాత్రి అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటంతో పోలీసులు ఆయన్ను వెంటనే కంకిపాడు సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఈ విషయం తెలుసు­కున్న వైయ‌స్ఆర్‌సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని నాని, పెనమలూరు నియోజకవర్గ సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి, పలువురు నేతలు ఆస్పత్రి వద్దకు వచ్చారు. అనంతరం, పేర్ని నాని వైద్యులతో మాట్లాడి వంశీ ఆరోగ్య పరిస్థితిపై ఆరాతీశారు. వంశీ సతీమణి పంకజశ్రీకి ధైర్యం చెప్పారు. ఇక, వంశీకి వైద్యం నేపథ్యంలో ఆసుపత్రి వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. 

Latest News
Researchers turn toxic fungus into potent anti-cancer compound Mon, Jun 23, 2025, 04:36 PM
India tops medal table at Seychelles National Day Boxing Tournament Mon, Jun 23, 2025, 04:36 PM
Arab nations condemn Damascus suicide bombing Mon, Jun 23, 2025, 04:34 PM
CM Nitish Kumar inaugurates six-lane Ganga bridge connecting Patna to north Bihar Mon, Jun 23, 2025, 04:28 PM
Saudi Arabia, Russia offer oil supply continuity for India amid Iran's Hormuz uncertainty Mon, Jun 23, 2025, 04:26 PM