![]() |
![]() |
by Suryaa Desk | Sat, May 24, 2025, 01:31 PM
పల్నాడు జిల్లా గురజాల సబ్ జైల్లో ఉన్న వైయస్ఆర్సీపీ కార్యకర్త ఉప్పుతల హరికృష్ణను ములాకత్ ద్వారా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంబటి రాంబాబు, గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు, గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి, డాక్టర్ చింతలపూడి అశోక్, కె.వి.మురళీధర్ రెడ్డి పరామర్శించారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం తంగెడ గ్రామానికి చెందిన వైయస్ఆర్సీపీ నేత ఉప్పుతల యల్లయ్య కుమారుడు హరికృష్ణని దాచేపల్లి సీఐ పి.భాస్కరరావు దారుణంగా కొట్టి అనంతరం న్యాయమూర్తి ముందు హాజరుపరచడం దారుణమైన చర్య అని వారు వాపోయారు. హరికృష్ణను గురజాల సబ్జైల్కు రిమాండ్కు పంపిన నేపద్యంలో వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు గురజాల సబ్ జైల్లో హరికృష్ణను పరామర్శించారు.
Latest News