![]() |
![]() |
by Suryaa Desk | Sat, May 24, 2025, 12:02 PM
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్మీట్పై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తాజాగా స్పందించారు. తన వ్యక్తిత్వంపై వస్తున్న విమర్శలను ఖండిస్తూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
"నేను మారను, నా వ్యక్తిత్వం ఎప్పుడూ ఇలాగే ఉంటుంది. పదవి వచ్చాక నీవే మొత్తానికి మారిపోయావు. మూడు దశాబ్దాలుగా నాకు రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో గాఢమైన అనుబంధం ఉంది. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రలోభాలకు లొంగను, ఎవరికీ భయపడను" అని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.
వైఎస్ జగన్తో తనకున్న సుదీర్ఘ సంబంధాన్ని గుర్తు చేస్తూ, తాను ఎల్లప్పుడూ సూత్రబద్ధంగా, నీతినిజాయతీలతో ముందుకు సాగుతానని ఆయన పేర్కొన్నారు.