![]() |
![]() |
by Suryaa Desk | Fri, May 23, 2025, 06:50 PM
ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా గుంతకల్ రైల్వే స్టేషన్ లో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ప్లాట్ ఫాం పైకప్పు నుంచి పెచ్చులు ఊడిపడడంతో ఓ బాలుడు చనిపోయాడు. రైల్వే స్టేషన్ లోని ఏడో నెంబర్ ఫ్లాట్ ఫాంపై ఈ ప్రమాదం జరిగింది. రామేశ్వరం వెళ్లేందుకు స్టేషన్ కు వచ్చిన ఓ కుటుంబం రైలు ఎక్కేందుకు ప్లాట్ ఫాంపై వేచి ఉంది. ఇంతలో పెచ్చులు ఊడిపడడంతో బాలుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. ఆసుపత్రికి తరలించేలోపే బాలుడు కన్నుమూశాడు. కాగా, ఈ దుర్ఘటనకు సంబంధించి పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.
Latest News