![]() |
![]() |
by Suryaa Desk | Fri, May 23, 2025, 06:43 PM
టీడీపీ నేత, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ మాట్లాడిన ప్రతి మాట అబద్ధమని, రాష్ట్ర అభివృద్ధిపై ఆయన చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని అన్నారు. "మినిస్ట్రీ ఆఫ్ స్టాటస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ నివేదిక ప్రకారం ఏపీ 8.21% వృద్ధి రేటుతో దేశంలో రెండో స్థానంలో ఉంది. 9.69% వృద్ధి రేటుతో తమిళనాడు మొదటి స్థానంలో ఉంది. ఇది కేవలం 11 నెలల్లో కూటమి ప్రభుత్వం సాధించిన విజయం. కానీ, జగన్ రెడ్డి మాత్రం గ్రోత్ రేటు ఘోరంగా పడిపోయిందని పచ్చి అబద్ధాలు చెప్పడం సిగ్గుచేటు" అని సోమిరెడ్డి పేర్కొన్నారు. ఐదేళ్ల విధ్వంస పాలనతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి, మద్యపాన నిషేధం పేరుతో కల్తీ మద్యం అమ్మి ప్రజల ప్రాణాలు తీశారని, మద్యాన్ని తాకట్టు పెట్టి తెచ్చిన అప్పులకు నేడు కూటమి ప్రభుత్వం వడ్డీలు కడుతోందని ఆరోపించారు.
Latest News