![]() |
![]() |
by Suryaa Desk | Fri, May 23, 2025, 02:00 PM
విద్యార్థుల సంక్షేమం కోసం తల్లికి వందనం అనే పథకం కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టారు. ఈ పథకం రాష్ట్రంలో విద్యావ్యవస్థలను బలోపేతం చేయడానికి ఎంతో కృషి చేస్తుంది. ఈ క్రమంలో ‘తల్లికి వందనం’ పథకంపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కీలక ప్రకటన చేశారు. పాఠశాలలు మొదలుపెట్టే రోజున ‘తల్లికి వందనం’ పథకం కింద ప్రతి విద్యార్థికి రూ.15వేలు అందిస్తామని ప్రకటించారు. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసి చూపిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకే దక్కుతుందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఉద్ఘాటించారు.
Latest News