![]() |
![]() |
by Suryaa Desk | Fri, May 23, 2025, 01:59 PM
టీడీపీ కోసం ప్రాణాలిచ్చే కార్యకర్తలే పార్టీకి బలమని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అనుభవం ఉన్న నేత అని కొనియాడారు. ఆత్మకూరులో రూ.450కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తున్నారని తెలిపారు. సోమశిల ప్రాజెక్ట్, రోడ్లు, కాలువలు వంటి చాలా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఆత్మకూరుకు మరిన్ని నిధులు తీసుకురావడానికి తనవంతుగా కృషి చేస్తానని... అభివృద్ధి ఇలాగే కొనసాగాలని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోరారు.
Latest News