![]() |
![]() |
by Suryaa Desk | Fri, May 23, 2025, 01:03 PM
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో భాగంగా నేడు ఏడుగురు కేంద్రమంత్రులతో ఆయన భేటీకానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులు, పథకాలపై సీఎం చంద్రబాబు చర్చించనున్నారు. ప్రాజెక్టులు, పథకాలు అమలుకు ఏపీకి సహకరించాలని కేంద్ర మంత్రులను కోరనున్నారు. ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రహ్లాద్ జోషితో భేటి అయ్యారు. గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల్లో ఏపీకి సహకారం అందించాలని కోరే అవకాశం ఉన్నట్లు సమాచారం. తర్వాత 11 గంటలకు రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ ను చంద్రబాబు కలవనున్నారు. ఏపీలో వ్యూహాత్మక రక్షణ, ఏరోస్పేస్ ప్రాజెక్ట్లపై ఆయనతో చర్చించనున్నారు. బీఈఎల్ డిఫెన్స్ కాంప్లెక్స్, హెచ్ఏఎల్-ఏఎంసీఏ తదితర అంశాలపై చర్చించనున్నారు.
Latest News