![]() |
![]() |
by Suryaa Desk | Fri, May 23, 2025, 12:56 PM
అనంతపురం జిల్లాలో ఓ వ్యక్తిపై ఎలుగుబంటి దాడి చేసింది. కళ్యాణదుర్గం మండలం మోరేపల్లి గ్రామంలో బలరాముడు అనే వ్యక్తిపై ఎలుగుబంటి దాడికి తెగబడింది. గ్రామంలోకి వచ్చిన ఎలుగుబంటి పొలాల్లో సంచరించింది. ఈ విషయాన్ని గ్రామస్థులు గుర్తించలేదు. దీంతో యదావిధిగా పొలం పనులకు వెళ్లారు ప్రజలు. బలరాముడు కూడా పొలంలోకి వెళ్లాడు. అతడి రాకను చూసిన ఎలుగుబంటి ఒక్కసారిగా దాడి చేసింది. వెంటనే భయాందోళనకు గురైన సదరు వ్యక్తి కేకలు వేస్తూ.. దాన్ని నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. అయితే ఎలుగుబంటి దాడిని గమనించిన స్థానికులు గట్టిగా కేకలు వేశారు. దీంతో వెంటనే ఎలుగుబంటి ముళ్లపొదల్లోకి పారిపోయింది. ఎలుగుబంటి దాడిలో తీవ్ర గాయాలపాలైన బలరాముడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఎలుగుబంటి దాడి చేసిన విషయాన్ని గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు తెలియజేశారు. వెంటనే ఎలుగుబంటిని బంధించాల్సిందిగా అక్కడి ప్రజలు కోరుతున్నారు.
Latest News