![]() |
![]() |
by Suryaa Desk | Thu, May 22, 2025, 02:30 PM
ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పూర్వ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొల్లి నాగేశ్వరరావు వర్ధంతి సభ బుధవారం విజయవాడలో జరిగింది. దీనికి కొల్లి నాగేశ్వరరావు అధ్యయన కేంద్రం సమన్వయకర్త టి.లక్ష్మీనారాయణ అధ్యక్షత వహించారు. నదుల అనుసంధాన ఆవశ్యకత-ప్రతిపాదనలు-సానుకూల, ప్రతికూలాంశాలపై చర్చించారు. పోలవరం గరిష్ఠ ఎత్తు 45.72 మీటర్లపై సీఎం చంద్రబాబు విస్పష్ట ప్రకటన చేయాలని సభ డిమాండ్ చేసింది. జలాశయ గర్భంలో 32-35 మీటర్ల వద్ద నుంచి నీటిని తోడేందుకు గతంలో జగన్ ప్రభుత్వం ఎత్తిపోతల పథకాన్ని తలపెట్టిందని, దానిని తక్షణమే రద్దు చేయాలని స్పష్టం చేసింది. రాయలసీమ, ఉత్తరాంధ్రలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల పూర్తికి ప్రాధాన్యమివ్వాలని కోరింది. పోలవరం-బనకచర్ల పథకంపై చర్చించి గోదావరి వరద జలాలను సద్వినియోగం చేసుకోవడానికి, బచావత్ ట్రైబ్యునల్ ద్వారా సంక్రమించిన కృష్ణా జలాలను పరిరక్షించుకోవడానికి.. రాయలసీమకు కృష్ణా జలాల తరలింపు ద్వారా శాశ్వత కరువు నివారణ చర్యలు చేపట్టడంపై సీఎం అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు.
Latest News