![]() |
![]() |
by Suryaa Desk | Thu, May 22, 2025, 02:29 PM
ఏపీలో అమరావతి పేరుతో భారీ కుంభకోణం జరుగుతోందని మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆరోపించారు. తెలంగాణలో సచివాలయ భవనాన్ని రూ.600కోట్లతో కేసీఆర్ నిర్మిస్తే.. ఏపీలో 12వేల మంది ఉద్యోగులకు అవసరమైన సచివాలయం ఇప్పటికే ఉండగా మరో భవనాన్ని రూ.4వేల కోట్లతో నిర్మించాల్సిన అవసరం ఏమిటన్నారు. రాజధానికి అవసరమైన భవనాలను 500ఎకరాల్లో విజయవాడ-గుంటూరు మధ్యలో కట్టాలని డిమాండ్ చేశారు.విజయసాయిరెడ్డిపై మాజీ సీఎం వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చంద్రబాబుకు లొంగిపోయారని విమర్శించారు. కూటమికి మేలు చేయడానికి రాజ్యసభ సీటును అమ్మేశారని ఆరోపించారు. ప్రలోబయలకు లోనై ఆయన రాజ్యసభకు రాజీనామా చేశారని అన్నారు.
Latest News