![]() |
![]() |
by Suryaa Desk | Thu, May 22, 2025, 02:23 PM
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం ఢిల్లీకి రానున్నారు. ఏపీ విధాన రోడ్ మ్యాప్ను ఆ భేటీలో సమర్పిస్తారు. శుక్రవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ సహా ఏడుగురు కేంద్ర మంత్రులతో వరుస భేటీలు నిర్వహిస్తారు. గవర్నింగ్ కౌన్సిల్ భేటీలోనే పోలవరం ప్రాజెక్టుపై నెలకొన్న అంతర్రాష్ట్ర వివాదాలపై చర్చించనున్నారు. ప్రధాని స్వయంగా ఈ అంశంపై దృష్టి సారించారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
Latest News