![]() |
![]() |
by Suryaa Desk | Thu, May 22, 2025, 01:13 PM
కొండపిలో డెయిరీ యూనిట్ ఏర్పాటు కోసం రూ. 5 కోట్లు నిధులు మంజూరైనట్లు రాష్ట్ర మారి టైమ్ బోర్డు డైరెక్టర్ దామచర్ల సత్య తెలిపారు. బుధవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఏపిఎం గోపీనాథ్ అధ్యక్షతన నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
ఈ సందర్భంగా దామచర్ల సత్య మాట్లాడుతూ, నియోజకవర్గం పరిధిలో మొత్తం రెండు డెయిరీ యూనిట్లను మంజూరు చేశామని, వాటిలో ఒకటి కొండపిలో, మరొకటి సింగరాయకొండ మండలంలోని పాకల గ్రామంలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ డెయిరీ యూనిట్ల ద్వారా స్థానిక రైతులకు ఆదాయ మార్గాలు ఏర్పడతాయనీ, పశుపాలనకు తోడ్పాటుగా ఉంటాయనీ ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.