![]() |
![]() |
by Suryaa Desk | Thu, May 22, 2025, 11:23 AM
ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్ధానాలకు భిన్నంగా కూటమి పాలన సాగుతోంది అని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. అయన మాట్లాడుతూ.... సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకపోగా గతంలో మా ప్రభుత్వంలో తీసుకొచ్చిన సంక్షేమ కార్యక్రమాలను అటకెక్కిస్తున్నారు. ఇంటింటికీ రేషన్ పంపిణీ చేయాలనే సంకల్పంతో నాడు సీఎంగా వైయస్ జగన్ తీసుకొచ్చిన ఎండీయూ(రేషన్ బండి) వాహనాలను ఆపేస్తామని తాజాగా కూటమి నేతలు ప్రకటించారు. కేవలం మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టారనే కారణంతో ఆయనకు మంచి పేరొస్తుంటే ఓర్వలేక, దేశం మెచ్చిన ఈ వ్యవస్థకు కూటమి ప్రభుత్వం మంగళం పాడేసింది. ఎన్నో రాష్ట్రాల నుంచి ప్రజాప్రతినిధులు వచ్చి మన రాష్ట్రంలో అమలవుతున్న ఇంటింటికీ రేషన్ పంపిణీ వ్యవస్థను చూసి స్ఫూర్తి పొందడమే కాకుండా ఆయా రాష్ట్రాల్లో అమలు చేశారు. పంజాబ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి భగవంత్ మాన్, నాటి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్తో కలిసి భారీ స్థాయిలో రేషన్ వాహనాలను ప్రారంభించారు. అచ్చం మన రాష్ట్రంలో మాదిరిగానే ఎండీయూ వాహనాలు రూపొందించారు. కానీ మన రాష్ట్రంలో మాత్రం ఎక్కడ జగన్ మార్క్ కనపడకుండా ఉండాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తుందని అన్నారు.
Latest News