జూన్ 1 నుంచి రేషన్ పంపిణీ విధానంలో మార్పు
 

by Suryaa Desk | Thu, May 22, 2025, 08:55 AM

జూన్ 1 నుంచి రేషన్ పంపిణీ విధానంలో మార్పు

ఆంధ్రప్రదేశ్‌లో నిత్యావసర సరుకుల పంపిణీ విధానంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు చేపట్టింది. మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ల  ద్వారా ఇంటింటికీ రేషన్ అందించే ప్రక్రియను నిలిపివేసి, తిరిగి చౌకధరల దుకాణాల  ద్వారానే పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ నూతన విధానం జూన్ 1 నుంచి అమల్లోకి రానుంది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, తెనాలిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల జాయింట్ కలెక్టర్లు, జిల్లా పౌరసరఫరాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న పలు ముఖ్య నిర్ణయాలను, అధికారులకు సూచనలను వివరించారు.ప్రధానంగా, జూన్ 1 నుంచి ఎండీయూ వాహనాల ద్వారా ఇంటింటికీ నిత్యావసర సరుకులు పంపిణీ చేసే విధానాన్ని నిలిపివేస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. లబ్ధిదారులు ఇకపై తమకు కేటాయించిన సంబంధిత రేషన్ షాపుల వద్దకే వెళ్లి సరుకులు తీసుకోవాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.అయితే, ఈ మార్పు నుంచి కొందరికి మినహాయింపు ఉంటుందని మంత్రి తెలిపారు. 65 సంవత్సరాలు పైబడిన వృద్ధులు, తీవ్ర అంగవైకల్యం కలిగిన దివ్యాంగులకు మాత్రం యధావిధిగా వారి ఇళ్ల వద్దకే నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తామని వివరించారు. వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.అదేవిధంగా, రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునే ప్రక్రియలో ప్రజలు ఎదుర్కొంటున్న సాంకేతిక సమస్యలను దృష్టిలో ఉంచుకుని, వాటి పరిష్కారానికి కొంత వెసులుబాటు కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ దిశగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలు అత్యంత సున్నితమైనవని, కాబట్టి లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నిత్యావసర సరుకుల పంపిణీ ప్రక్రియను పకడ్బందీగా, సజావుగా నిర్వహించాలని మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులకు గట్టిగా సూచించారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని ఆయన నొక్కిచెప్పారు.ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కలెక్టరేట్ల నుంచి సంయుక్త కలెక్టర్లు, జిల్లా పౌరసరఫరాల అధికారులు, జిల్లా మేనేజర్లు  పాల్గొన్నారు.

Latest News
SC to hear pleas against SIR in Bihar on Monday Sun, Jul 27, 2025, 05:22 PM
Shivraj Chauhan takes stock of development schemes Sun, Jul 27, 2025, 05:12 PM
4th Test: England skipper Ben Stokes bowls during practice ahead of day five play Sun, Jul 27, 2025, 05:08 PM
4th Test: Great to see Gill and Rahul fight it out for the rest of the team, says Karthik Sun, Jul 27, 2025, 05:04 PM
Rainstorm in China forces evacuation of over 3,000 residents in Beijing Sun, Jul 27, 2025, 03:41 PM