సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్‌కు మించి సంపాదన.. ఏడాదిలో ఇన్ని వందల కోట్లా
 

by Suryaa Desk | Wed, May 21, 2025, 11:24 PM

టెస్లా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా (సీఎఫ్‌ఓ) ఉన్న భారత సంతతికి చెందిన వైభవ్ తనేజా (47), 2024లో అసాధారణంగా రూ. 1,150 కోట్లు (139 మిలియన్ డాలర్లు) సంపాదించాడు. ఈ మొత్తం మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ వార్షిక ఆదాయాలను కూడా అధిగమించింది. గ్లోబల్ బిజినెస్ వర్గాలలో ఇది సంచలనం సృష్టించింది. దశాబ్దాలలో ఒక ఫైనాన్స్ చీఫ్‌కు లభించిన అత్యధిక ప్యాకేజీలలో ఇది ఒకటిగా నిలిచింది. ఈ విషయాన్ని 'ది వాల్ స్ట్రీట్ జర్నల్' మొదట నివేదించింది. 2023లో టెస్లా సీఎఫ్‌ఓగా బాధ్యతలు చేపట్టిన తనేజా, బేసిక్ పే కింద కింద 400,000 డాలర్లు (సుమారు రూ. 3.3 కోట్లు) అందుకున్నారు. అయితే, ఆయన ఆదాయంలో ఎక్కువ భాగం ప్రమోషన్ తర్వాత లభించిన స్టాక్ ఆప్షన్లు, ఈక్విటీ అవార్డుల నుండి వచ్చింది.


టెస్లా షేర్లు సుమారు 250 డాలర్ల వద్ద ట్రేడవుతున్నప్పుడు ఈ ఈక్విటీ-లింక్డ్ ఇన్సెంటివ్‌లు మంజూరు అయ్యాయి. ఇవి నాలుగేళ్ల కాలంలో వైభవ్ తనేజాకు అందుతాయి. 2025, మే 19 నాటికి టెస్లా స్టాక్ సుమారు 342 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఇటీవల నెలల్లో కంపెనీ డెలివరీలు తగ్గడం, లాభాలు తగ్గడం వంటి సమస్యలను ఎదుర్కొన్నప్పటికీ ఆయన ఆదాయం భారీగా పెరిగింది.


ఇక.. మైక్రోసాఫ్ట్ చైర్మన్, సీఈఓ సత్య నాదెళ్ల 2024లో రూ. 650 కోట్లు (79.106 మిలియన్ డాలర్లు) సంపాదించారు. ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ ఇదే కాలంలో రూ. 88 కోట్లు (10.73 మిలియన్ డాలర్లు) పొందారు. తనేజా 2024 ఆదాయం వీరిద్దరినీ మించిపోయింది. గతంలో నికోలా కార్పొరేషన్ సీఎఫ్‌ఓ 2020లో సంపాదించిన 86 మిలియన్ డాలర్ల రికార్డును కూడా తనేజా అధిగమించారు.


తనేజాకు భారీ ఆదాయం లభించిన సమయంలో టెస్లా తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటుంది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ అమ్మకాలు తగ్గడం, లాభాల మార్జిన్‌పై ఒత్తిడి, ప్రపంచవ్యాప్తంగా పోటీ పెరగడం వంటి సమస్యలు ఎదుర్కొంటోంది. 2012 తర్వాత టెస్లా అత్యంత తీవ్రమైన వార్షిక అమ్మకాల క్షీణతను నమోదు చేసింది. సీఈఓ ఎలాన్ మస్క్‌కు సంబంధించిన వివాదాలు కూడా కంపెనీకి అదనపు సవాళ్లను తెచ్చిపెట్టాయి.


టెస్లాలో ఎలాన్ మస్క్ ప్రస్తుత స్థితికి విరుద్ధంగా, తనేజా ప్రాముఖ్యత పెరుగుతోంది. మస్క్ టెస్లా నుంచి ఎలాంటి జీతం తీసుకోవడం లేదు. తన 56 బిలియన్ డాలర్ల పరిహార ప్రణాళికను రద్దు చేసిన డెలావేర్ కోర్టు తీర్పుపై మస్క్ అప్పీల్ చేస్తున్నారు. తన నాయకత్వంలో కంపెనీ సాధించిన అసాధారణ వృద్ధిని బట్టి ఈ ఒప్పందం సరైనదే అని మస్క్ వాదిస్తున్నారు.


వైభవ్ తనేజా ఎవరు?


భారతదేశంలో పుట్టిన వైభవ్ తనేజా, 1999లో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ డిగ్రీని పొందాడు. 2000లో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియాలో చార్టర్డ్ అకౌంటెంట్‌గా అర్హత సాధించారు. 2006లో యునైటెడ్ స్టేట్స్‌లో సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటెంట్‌గా మారారు. తనేజా దాదాపు 17 సంవత్సరాలు గ్లోబల్ ఆడిట్ సంస్థ ప్రైస్‌వాటర్‌హౌస్‌కూపర్స్‌లో పనిచేశాడు. భారతదేశంతో పాటు అమెరికాలోనూ సేవలందించి, అష్యూరెన్స్‌లో సీనియర్ మేనేజర్ స్థాయికి ఎదిగారు.


2016లో అమెరికాకు చెందిన సోలార్ ప్యానెల్ డెవలపర్ సోలార్‌సిటీ కార్పొరేషన్‌లో చేరారు. అక్కడ వివిధ ఫైనాన్స్, అకౌంటింగ్ పదవులు నిర్వహించి.. అదే ఏడాది టెస్లా సోలార్‌సిటీని కొనుగోలు చేసిన తర్వాత, తనేజా 2017లో టెస్లాలో కార్పొరేట్ కంట్రోలర్‌గా చేరారు. ఆయన కృషిని గుర్తించి, 2019 మార్చిలో చీఫ్ అకౌంటింగ్ ఆఫీసర్‌గా నియమించారు. 2023 ఆగస్టులో ఆయన చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్‌ఓ) పదవికి ఎదిగే వరకు అదే హోదాలో పనిచేశారు.


టెస్లా భారతదేశంలో తన కార్యకలాపాలను విస్తరించడంలో తనేజా కీలక పాత్ర పోషించారు. 2021 జనవరిలో టెస్లా ఇండియా మోటార్స్ అండ్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్‌కు డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఇది కంపెనీ అంతర్జాతీయ వృద్ధి వ్యూహంలో ఆయన ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది.


Latest News
Athletics: Kenya's Sawe becomes first man to run a marathon under two hours Sun, Apr 26, 2026, 06:26 PM
Two dead, five injured in Southern Afghanistan road accident Sun, Apr 26, 2026, 06:24 PM
UP visit: PM Modi to open Ganga Expressway, other projects in Varanasi on April 28-29 Sun, Apr 26, 2026, 06:21 PM
HPCL pins refinery fire to leak, ops to restart in May's second half Sun, Apr 26, 2026, 06:15 PM
Over 51.8 lakh domestic LPG cylinders delivered in a day, supply normal Sun, Apr 26, 2026, 06:13 PM