|
|
by Suryaa Desk | Wed, May 21, 2025, 06:24 PM
కూటమి ప్రభుత్వ పాలనపై వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి పరిపాలించాలనుకోవడం అవివేకమని ఆయన మండిపడ్డారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో జరిగిన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.ప్రభుత్వ తీరును తప్పుబడుతూ మిథున్ రెడ్డి పలు కీలక ఆరోపణలు చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను నిలిపివేయడం దారుణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా, ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి, ప్రజల దృష్టిని మరల్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇంటింటికీ రేషన్ పంపిణీ చేసే వాహనాలను రద్దు చేయడం సరైన చర్య కాదని హితవు పలికారు.గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎలాంటి మద్యం కుంభకోణం జరగలేదని మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కట్టుకథలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ, మద్యం కుంభకోణం జరిగిందంటూ దుష్ప్రచారం చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కేవలం రాజకీయ దురుద్దేశంతో చేస్తున్న ప్రచారమేనని కొట్టిపారేశారు.
Latest News