|
|
by Suryaa Desk | Wed, May 21, 2025, 03:49 PM
రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, భయపెట్టి పాలన చేయాలనుకోవడం మూర్ఖత్వమని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఉమ్మడి అనంతపురం జిల్లా వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రేషన్ వాహనాల రద్దు నిర్ణయం సరికాదని హితవు పలికారు. అలాగే, జగన్ పాలనలో మద్యం కుంభకోణం జరగలేదని స్పష్టం చేశారు. టీడీపీ కట్టుకథలతో మద్యం కుంభకోణం జరిగినట్లు తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన మండిపడ్డారు.