|
|
by Suryaa Desk | Tue, May 20, 2025, 12:20 PM
ముఖ్యమంత్రి చంద్రబాబు ఈనెల 21న తన సొంత నియోజకవర్గం కుప్పం రానున్నారు. ఇక్కడ జరుగుతున్న గంగజాతరలో భాగంగా ఆ రోజున జరిగే గంగమ్మ విశ్వరూప దర్శనంలో అమ్మవారిని చంద్రబాబు దర్శించుకుంటారు. ఈ సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని టీడీపీ వర్గాలు తెలిపాయి. బెంగళూరు నుంచి హెలికాప్టర్లో ఆ రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు వచ్చి.. 2.30 గంటలకు తిరిగి ప్రయాణమయ్యేలా షెడ్యూల్ ఖరారైంది.
Latest News