|
|
by Suryaa Desk | Sat, May 17, 2025, 06:04 PM
హర్యానాలో సంచలనం సృష్టించిన గూఢచర్యం కేసులో ఓ ప్రముఖ యూట్యూబర్తో పాటు మరికొందరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ‘ట్రావెల్ విత్ జో’ పేరుతో యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్న జ్యోతి మల్హోత్రా, భారత సైనిక రహస్యాలను పాకిస్థాన్కు చేరవేసినట్లు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ ఘటనతో సున్నితమైన సమాచారాన్ని లీక్ చేసేందుకు డిజిటల్ వేదికలను ఎలా దుర్వినియోగం చేస్తున్నారనే విషయంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ట్రావెల్ వీసాపై పాకిస్థాన్లో పర్యటించిన జ్యోతి మల్హోత్రా, అక్కడ పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ ఏజెంట్గా పనిచేసి, భారత దేశానికి చెందిన కీలక సైనిక సమాచారాన్ని వారికి చేరవేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఆరోపణల నేపథ్యంలో జ్యోతి మల్హోత్రాతో పాటు మరో ఆరుగురిని హర్యానా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Latest News