|
|
by Suryaa Desk | Sat, May 17, 2025, 10:26 AM
జరగనిది జరిగినట్లు దుష్ప్రచారం చేస్తూ, ప్రతి అంశంలో గత వైయస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని నిందించడమే లక్ష్యంగా టీడీపీ కూటమి ప్రభుత్వం పని చేస్తోంది అని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. అయన మాట్లాడుతూ.... కూటమి ప్రభుత్వ అధికార దుర్వినియోగానికి పరాకాష్ట.. ఈరోజు మాజీ ఐఏఎస్ కె.ధనుంజయరెడ్డి, మాజీ ప్రభుత్వ అధికారి కృష్ణమోహన్రెడ్డి అరెస్ట్.అసలు జరగని లిక్కర్ స్కామ్ జరిగిందని ఆరోపిస్తూ, ఎక్కడా, ఏ ఆధారాలు లేకపోయినా..తప్పుడు కేసులు పెడుతూ, అందులో అందరి పేర్లు చేరుస్తూ, తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తూ, తప్పుడు వాంగ్మూలాలతో కూటమి ప్రభుత్వం లేని లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తు చేస్తోంది.టార్గెట్గా పెట్టుకున్న వారిని అందులో చేర్చి, అరెస్టులు చేస్తోంది.సీఎం చంద్రబాబు చేస్తున్న ఈ అనైతిక పని, మొత్తం వ్యవస్థలపైనే ప్రభావం చూపుతుంది.మంత్రి నారా లోకేష్ పదే పదే చెబుతున్నట్లుగా, రాష్ట్రంలో యథేచ్ఛగా రెడ్బుక్ రాజ్యాంగం కొనసాగుతోంది.ఈరోజు టీడీపీ కూటమి ప్రభుత్వం చేస్తున్న పని, భవిష్యత్తులో అదే పంథా కొనసాగేందుకు దారి చూపుతుందన్న విషయం మరవొద్దు.మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయరెడ్డి, మాజీ ప్రభుత్వాధికారి కృష్ణమోహన్రెడ్డి అరెస్టులను ఖండిస్తున్నాం.ఈ విషయంపై పార్టీ న్యాయ పోరాటం చేస్తుంది. మాకు న్యాయస్థానాల మీద, ఆ వ్యవస్థ మీద నమ్మకం ఉంది అని ఆశాభావం వ్యక్తపరిచారు.
Latest News