|
|
by Suryaa Desk | Fri, May 16, 2025, 04:06 PM
గాజా నగరంపై ఇజ్రాయెల్ మరోసారి తీవ్రమైన వైమానిక దాడులు చేసింది. గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు జరిగిన ఈ దాడుల్లో ఇప్పటివరకు 64 మంది మరణించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఈ దాడుల్లో వందలాది మంది గాయపడ్డారు.
క్షతగాత్రులను గాజా నగరంలోని నాజర్ ఆసుపత్రికి తరలించగా, మృతదేహాలను ఆసుపత్రి మార్చురీకి పంపినట్లు స్థానిక వర్గాలు తెలిపాయి. ఈ దాడులు గాజాలో తీవ్ర ఉద్రిక్తతలను రేకెత్తించాయి.