![]() |
![]() |
by Suryaa Desk | Thu, May 15, 2025, 07:44 PM
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన గురువారం సచివాలయంలో జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి 6వ సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సుమారు రూ. 33 వేల కోట్లకు పైగా విలువైన 19 పారిశ్రామిక ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. ఈ పెట్టుబడులు ప్రధానంగా ఎనర్జీ, టూరిజం, ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో రానున్నాయి. వీటి ద్వారా సుమారు 35 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు దక్కుతాయని అంచనా.గత ప్రభుత్వ విధానాలతో రాష్ట్రంపై విశ్వాసం కోల్పోయిన పారిశ్రామికవేత్తలను తిరిగి ఆకర్షించడంలో ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలిస్తున్నట్లు ఈ పరిణామాలు సూచిస్తున్నాయి. గడచిన 11 నెలల కాలంలో ఎస్ఐపీబీ ఆరుసార్లు సమావేశమై, మొత్తం 76 ప్రాజెక్టులకు పచ్చజెండా ఊపింది. వీటి ద్వారా రాష్ట్రానికి రూ.4,95,796 కోట్ల పెట్టుబడులు రానుండగా, 4,50,934 మందికి ఉపాధి లభించనుంది. ఇప్పటికే కొన్ని సంస్థలు శంకుస్థాపనలు కూడా పూర్తిచేశాయి.6వ ఎస్ఐపీబీ సమావేశంలో వివిధ రంగాలకు చెందిన మొత్తం 19 సంస్థలకు సంబంధించి రూ. 33,720 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపారు. వీటి ద్వారా 34,621 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి.
Latest News