వారంతా ఇంటి నుంచే ఓటు వేయొచ్చు.. లోక్‌సభ ఎన్నికల్లో 1.73 కోట్ల మందికి అవకాశం
 

by Suryaa Desk | Sat, Mar 16, 2024, 10:26 PM

ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయింది. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు పోటీ కోసం సిద్ధం అవుతున్నారు. అటు.. ఎన్నికల నిర్వహణ కోసం కూడా కేంద్ర ఎన్నికల సంఘం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన ఎన్నికల సంఘం.. దేశంలో 7 దశల్లో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించనుంది. 543 లోక్‌సభ నియోజకవర్గాలతోపాటు 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనుంది. ఈ క్రమంలోనే ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తోంది. దేశంలో ఓటర్ల సంఖ్య, అందులో పురుషులు, మహిళలు, యువ ఓటర్ల సంఖ్యను వెలువరించింది. తాజాగా ఓట్ ఫ్రమ్ హోం ఎవరెవరికి అనేది వెల్లడించింది.


దేశంలో మొత్తం 97 కోట్ల ఓటర్లు ఉన్నారని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ వెల్లడించారు. అయితే 85 ఏళ్లు పైబడిన వారు, వికలాంగులు ఇంటి నుంచి ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. వికలాంగులు అందరికీ కాకుండా 40 శాతం కంటే ఎక్కువ వైకల్యం కలిగి ఉన్న వారికి మాత్రమే ఈ ఓట్ ఫ్రమ్ హోం వేయొచ్చని వివరించారు. ఈ సందర్భంగానే అర్హులైన వారి వివరాలను కూడా ఎన్నికల సంఘం వెల్లడించింది. ఇలా 40 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్న వారు దేశంలో 88.4 లక్షల మంది ఓటు వేసేవారు ఉన్నారని తెలిపింది. ఇక 85 ఏళ్ల వయసు పై బడిన వారు 82 లక్షల మంది వృద్ధులు ఉన్నారని పేర్కొంది. ఇక వందేళ్లు పై బడిన వారు 2.18 లక్షల మంది ఉన్నారని స్పష్టం చేసింది. వీరంతా కలిసి మొత్తం 1.73 కోట్ల మంది ఉన్నారని.. వారందరికీ ఓట్ ఫ్రం హోం అవకాశం కల్పించనున్నట్లు చెప్పారు.


ఇక వీళ్లు కాకుండా 85 ఏళ్ల లోపు ఉన్న వృద్ధులు, 40 శాతం కంటే తక్కువ వైకల్యం ఉన్న ఓటర్లకు పోలింగ్ స్టేషన్ల వద్ద అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. అన్ని పోలింగ్ బూత్‌లలో వాలంటీర్లను అందుబాటులో ఉంచుతామని.. వీల్ చైర్‌లు ఏర్పాటు చేస్తామని వివరించారు. దివ్యాంగులు, వృద్ధులను ఇళ్ల నుంచి పోలింగ్ స్టేషన్లకు తీసుకువచ్చేందుకు రవాణా సౌకర్యం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. వీటితోపాటు అన్ని పోలింగ్ బూత్‌ల వద్ద కనీస మౌలిక వసతులైన తాగునీరు, మరుగుదొడ్లు అందుబాటులో ఉంచుతామని చెప్పారు.


ఇతర నియోజకవర్గాల్లో ఎన్నికలను కవర్ చేసే జర్నలిస్టులకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని అందుబాటులోకి తెస్తామని సీఈసీ రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. వీరే కాకుండా నిబంధనల ప్రకారం ప్రత్యేక ఓటర్లు.. రక్షణ, పోలీసు, పారామిలటరీ బలగాలలో పనిచేసే సర్వీస్ ఓటర్లు, ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు, జైలులో ఉన్న వారికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం అందుబాటులో ఉందని తెలిపారు. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ రోజున ఈవీఎంలలో ఓట్లు లెక్కించడానికి అరగంట ముందు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని చెప్పారు.


ఇక దేశవ్యాప్తంగా మొత్తం 97 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని వివరించారు. 10.5 లక్షలకు పైగా పోలింగ్ స్టేషన్లు.. ఎన్నికల నిర్వహణలో సుమారు 1.5 లక్షల మంది అధికారులు విధులు నిర్వర్తించనున్నారు. 18 నుంచి 29 ఏళ్ల మధ్య వయసున్న యువ ఓటర్లు 2 కోట్ల మంది ఓటర్ల జాబితాలో పేర్లు చేర్చుకున్నారని వెల్లడించింది.

Latest News
MP govt orders mass rabies vaccination after guests consume infected 'chhas' Fri, May 08, 2026, 11:57 AM
Cloudflare to cut over 1,100 jobs amid AI-led restructuring Fri, May 08, 2026, 11:56 AM
Four arrested for plotting Bengaluru woman's murder by staging accident Fri, May 08, 2026, 11:53 AM
Bihar Cabinet expansion: Ministers take charge; NDA leaders emphasise unity, development focus Fri, May 08, 2026, 11:51 AM
Hardcore criminal of Dev Kalyanpuri gang arrested under 'Operation Gang Bust'; illegal firearm, live cartridges recovered Fri, May 08, 2026, 11:46 AM