|
|
by Suryaa Desk | Sat, Mar 16, 2024, 03:11 PM
కొండకమర్ల ప్రాధమిక పాఠశాల 2 ఆవరణంలో శనివారం పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా వారి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా హెచ్. ఎం నాగరాజు, డిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు గౌస్ లాజమ్ మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగంతోనే ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించుకోగలిగామని, ఆంధ్రరాష్ట్రం కోసం అసువులు బాసిన అమరజీవి పొట్టి శ్రీరాములు ఆశయం, త్యాగం వృథా కావన్నారు. శ్రీరాములు జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు.
Latest News