|
|
by Suryaa Desk | Fri, Mar 15, 2024, 01:16 PM
రాష్ట్రంలో జగన్మోహన్రెడ్డి అరాచక పాలనకు స్వస్తి చెప్పాల్సిన రోజు వచ్చిందని ఎస్.కోట నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి కోళ్ల లలిత కుమారి తెలిపారు. గురువారం మండల కేంద్రంలో జనసేన 11వ ఆవిర్భావ దినోత్సవాన్ని నియోజకవర్గ సమన్వయకర్త ఒబ్బిన సత్యనారాయణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిఽథిగా పాల్గొన్న కోళ్ల..సీఎం జగన్పై మండిపడ్డారు. రాష్ట్ర భవిష్యత్, ప్రజా అవసరాల కోసం కూటమి ఏర్పడిన విషయాన్ని ఆమె ప్రజలకు వివరించారు. ఇరు పార్టీల జెండాలు చేతబట్టి ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఉచిత వైద శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్.చినరాము, ఇర్ర వెంకటలక్ష్మి, కుమారి, జన సైనికులు పాల్గొన్నారు.
Latest News