|
|
by Suryaa Desk | Fri, Feb 09, 2024, 07:14 PM
ఎన్నికల ముంగిట వెనుకబడిన వర్గాలను వంచించడానికే సీఎం జగన్.. వాలంటీర్లతో బీసీ కులగణన చేయిస్తున్నారని టీడీపీ నేత కొల్లు రవీంద్ర ఆరోపించారు. వాలంటీర్లు చేస్తున్న
బీసీ కులగణనకు విశ్వసనీయత, చట్టబద్ధత ఉంటుందని జగన్ చెప్పగలరా? అని ప్రశ్నించారు. స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లు 34 నుంచి 24 శాతానికి తగ్గించిన జగన్ బీసీలకు న్యాయం చేస్తారా? అని నిలదీశారు.