|
|
by Suryaa Desk | Thu, Feb 08, 2024, 12:31 PM
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పదేళ్ల మోదీ ప్రభుత్వ పాలనపై బ్లాక్ పేపర్ విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం వైట్ పేపర్కి కౌంటర్గా దీన్ని రూపొందించారు.
ఈ బ్లాక్ పేపర్లో కేంద్రప్రభుత్వ వైఫల్యాలన్నీ ప్రస్తావించినట్టు ఖర్గే వెల్లడించారు. నిరుద్యోగం, ధరల పెరుగుదల, రైతుల సమస్యలతో పాటు ఆర్థిక వ్యవస్థలోని లోపాలనూ ఎత్తి చూపినట్టు స్పష్టం చేశారు.