|
|
by Suryaa Desk | Thu, Feb 08, 2024, 11:18 AM
వైజాగ్ టెస్టులో గెలిచి భారత జట్టు సిరీస్ సమం చేసింది. అయితే ఈ సిరీస్లో కీలకమైన రాజ్కోట్ టెస్టుకు ఇంకా 8 రోజుల సమయం ఉంది. ఆలోపు మిగిలిన మూడు టెస్టులకు బీసీసీఐ తుది జట్టును ప్రకటించనుంది. ఈ క్రమంలో సీనియర్ ఆటగాడు జడేజా తన గాయంపై అప్డేట్ ఇవ్వడం సంతోషాన్నిస్తోంది. తొడ కండరాల గాయం నుంచి కోలుకుంటున్నానని నెట్టింట పోస్ట్ పెట్టాడు. దాంతో, మూడో టెస్టుకు జడ్డూ అందుబాటులో ఉండే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
Latest News