ఢిల్లీ పర్యటనకు చంద్రబాబు.. అమిత్ షాతో కీలక భేటీ, ఫిక్స్ అయ్యారా?
 

by Suryaa Desk | Wed, Feb 07, 2024, 07:42 PM

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారాయి. పార్టీల మధ్య పొత్తుల అంశాన్ని తేల్చేందుకు ప్రధాన పార్టీల అధినేతలు దూకుడు పెంచారు. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యేందుకు హస్తినకు వెళ్తున్నట్లు తెలుస్తోంది.. మధ్యాహ్నం 2.20 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి.. 4.30 గంటలకు ఢిల్లీ చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేస్తారు.. బుధవారం రాత్రి కానీ, గురువారం కానీ ఆయన అమిత్‌షాతో సమావేశమవుతారని తెలుస్తోంది. గురువారం సాయంత్రం ఢిల్లీ నుంచి చంద్రబాబు తిరుగు ప్రయాణమవుతారని చెబుతున్నారు. చంద్రబాబు అమిత్ షాతో భేటీకానుండటం చర్చనీయాంశమైంది.. ఎన్నికల పొత్తుల అంశంపై చర్చిచేందుకా.. ఇతర కారణాలు ఉన్నాయా అన్నది క్లారిటీ రావాల్సి ఉంది.


ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే టీడీపీ-జనసేన మధ్య పొత్తు ఖాయం కాగా.. బీజేపీ కూడా ఈ కూటమితో కలిసే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. 2014 ఎన్నికల సమయంలో టీడీపీ, జనసేన, బీజేపీ మూడు కలిసి ఏపీలో కూటమిగా ఉన్నాయి. ఇప్పుడు ఎన్నికలకు మరికొన్ని నెలలే సమయం మిగిలి ఉండటంతో.. పొత్తుల అంశాన్ని తేల్చాలని భావిస్తున్నారట. చంద్రబాబు ఢిల్లీ టూర్‌లో ఈ పొత్తుల అంశం దాదాపు ఫైనల్ అవుతుందనే వాదన వినిపిస్తోంది. ఈ పొత్తుల అంశంపై ఏ మలుపు తీసుకుంటుందో మరో రెండు రోజుల్లో తేలిపోతుందంటున్నారు. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు దూకుడు పెంచారు.. రా కదలి రా పేరుతో సభలు నిర్వహిస్తున్నారు. ఓ వైపు సభలు నిర్వహిస్తూనే మరోవైపు అభ్యర్థుల ఎంపిక సహా కీలక అంశాలపై ఫోకస్ పెట్టారు. చంద్రబాబు ఎన్నికలకు సమాయత్తం చేసే దిశగా పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జులు, ముఖ్య నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. కొందరు ఎంపిక చేసిన ఇంఛార్జ్‌లను ఉండవల్లిలోని తన నివాసానికి పిలిపించి మాట్లాడుతున్నారు. మంగళవారం సుమారు 10 మందితో ఆయన మాట్లాడారు. ఒక్కొక్కరికి కనీసం 10-15 నిమిషాల సమయం కేటాయిస్తున్నారు. మంగళవారం రాత్రి బాగా పొద్దుపోయే వరకు ఈ భేటీలు జరిగాయి. మొత్తం 25 మంది వరకు పిలిచి మాట్లాడాలని ఆయన నిర్ణయించారు.


తొలిరోజు చంద్రబాబుతో సమావేశమైనవారిలో పరిటాల సునీత (రాప్తాడు), నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి (పీలేరు), పుట్టా సుధాకర్‌ యాదవ్‌ (మైదుకూరు), బుడ్డా రాజశేఖర్‌రెడ్డి (శ్రీశైలం),వర్ల కుమార్‌ రాజా (పామర్రు), చింతమనేని ప్రభాకర్‌ (దెందులూరు), బండారు సత్యనారాయణమూర్తి (పెందుర్తి), కోండ్రు మురళి (రాజాం)తో పాటు మరో ఇద్దరు ఇంఛార్జ్‌లు ఉన్నారు. ఎన్నికలకు ఎంతో సమయం లేదని, చిన్న చిన్న లోపాలుంటే వెంటనే సరిదిద్దుకుని పూర్తిస్థాయిలో సిద్ధం కావాలని చంద్రబాబు సూచించారు. వచ్చే ఎన్నికల్లో టికెట్‌లు వారివేనని చంద్రబాబు నేరుగా చెప్పకపోయినా.. దాదాపుగా టికెట్‌లు ఖాయమైనవారినే తొలి దశలో పిలిచి మాట్లాడుతున్నారన్న అభిప్రాయం పార్టీ నాయకుల్లోనూ, ఆయనతో సమావేశమైన ఇంఛార్జ్‌లలో వ్యక్తమవుతోంది.


Latest News
'Hindi imposition in disguise': Stalin slams Centre over 'Three-Language Policy' Sat, Apr 04, 2026, 01:05 PM
IPL 2026: RCB skipper Rajat Patidar, Jitesh Sharma visit Tirumala temple ahead of CSK clash Sat, Apr 04, 2026, 12:54 PM
Pakistan fuel price hike sparks Oppn protests, calls to oust Shehbaz Sharif govt Sat, Apr 04, 2026, 12:40 PM
Mumbai's Stasya Pandya clinches dual Team medals at Delhi Horse Show 2026 Sat, Apr 04, 2026, 12:30 PM
'Why are you asking me?': Kohli responds to 'overseas player' tag with humour Sat, Apr 04, 2026, 12:09 PM